
ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పంది. సాగును లాభసాటిగా మార్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘రైతన్నా.. మీ కోసం’ పేరుతో ఈ నెల 24 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం సూచించిన ఐదు వ్యవసాయ సూత్రాలపై.. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. అనంతరం డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్షాప్లను ప్రభుత్వం నిర్వహించనుంది.
అందించింది. వ్యవసాయ రంగంలో చేపడుతున్న మార్పుల్లో భాగంగా.. సాగును లాభసాటిగా చేసేందుకు మహత్తర కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్ 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ- మార్కెటింగ్ అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతుసేవా కేంద్రాల సిబ్బంది సహా 10 వేల మందితో గురువారం (నవంబర్ 20) ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా, డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది.
