
గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ అందించే ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొదటి కాన్పులో రూ. 5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. పథకం వివరాలు ఇలా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణుల కోసం ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం సహకారంతో ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగేవారికి మంచి పోషకాహారం అందించి, ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ యోజన (పీఎంఎంవీవై) కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అండగా నిలుస్తోంది. ప్రసవ సమయంలో అయ్యే ఖర్చులకు ఇబ్బందులు లేకుండా.. చేయూతనిస్తోంది. మొదటిసారి తల్లి కాబోయే వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే, అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 6 వేల రూపాయలు ఇస్తారు.
