
ఆంధ్రప్రదేశ్లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రైతులు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే అమరావతి నిర్మాణం ఆలస్యం అయిందని తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని.. మంత్రి నారాయణ వెల్లడించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాల మేరకు అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యాన్ని వివరించారు.
ఈ క్రమంలోనే అమరావతిని గ్లోబల్ రాజధానిగా తీర్చిదిద్దడంలో భాగంగా.. స్మార్ట్ ఇండస్ట్రీలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్కు శ్రీకారం చుట్టింది. ఈ విడతలో రైతులు అందించే 7 వేలకు పైగా ఎకరాల భూముల్లో.. సుమారు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.
