ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీనియర్ జడ్జిని విధుల నుంచి తొలగించారు

Date:

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ జడ్జి బి. కృష్ణవేణిని సర్వీసు నుంచి తొలగించడం కలకలం రేపుతోంది. తీర్పులు రాయకపోవడం, సంతకాలు చేయకపోవడం వంటి ఆరోపణలపై హైకోర్టు సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇదిలా ఉండగా, నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై కూడా వేటు పడింది. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచే దిశగా ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందనే చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ జడ్జి‌ను సర్వీసు నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణిని సర్వీసు నుంచి తొలగించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో హైకోర్టు సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నారు. తీర్పులు రాయకపోవడం, అలాగే ఉత్తర్వులపై కూడా సంతకాలు చేయకపోవడం, సిబ్బందికి న్యాయపరమైన పనులు అప్పగించడం వంటి ఆరోపణలు వచ్చాయి. కృష్ణవేణిపై ధర్మవరం బార్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఆమెపై మొత్తం 12 అభియోగాలు నమోదయ్యాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...