
ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంటోంది. లక్నో నుంచి శార్ధూల్ ఠాకూర్ను తీసుకుంటున్న వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు కోల్కతా నైట్రైడర్స్ నుంచి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తిరిగి జట్టులోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. గతంలో ముంబై తరఫున ఆడిన మార్కండే, కేకేఆర్లో ఆడే అవకాశం దక్కలేదు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి రాహుల్ చహార్ను కూడా తిరిగి తీసుకురావాలని ముంబై యోచిస్తోంది
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ తమ జట్లను స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ట్రేడ్ విండోలో బిజీగా మారింది. తమ పాత టాలెంటెడ్ ప్లేయర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఇప్పటికే ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకున్న ముంబై జట్టు, ఇప్పుడు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో కొలకతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
