యుద్ధ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. సెన్సెక్స్ 6700 పాయింట్లు పతనం, ఇన్వెస్టర్లకు రూ.33 లక్షల కోట్ల నష్టం

Date:

Investors Wealth: కొద్ది రోజుల క్రితం వరకు భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ పెద్దగా పడిపోలేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో మార్కెట్ సూచీలు తీవ్రంగా కుదేలవుతున్నాయి. ఈ వారం కూడా సూచీలు భారీగా పతనమవగా.. మార్చి నెలలో సెన్సెక్స్ 6700 పాయింట్లకు పైగా పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది.

Crude Oil Prices: భారత స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. యుద్ధ ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తూ మార్కెట్లపై స్పష్టమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ చమురు నౌకలను అడ్డుకోవడం వల్ల సరఫరాపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో సూచీలు వరుసగా పతనం అవుతున్నాయి.

ఈ వారం మార్చి 9 నుంచి 13 వరకు గమనిస్తే.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 4,355 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 1,299 పాయింట్లు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.19.86 లక్షల కోట్లు తగ్గింది. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది.

ఇక యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే.. శని, ఆదివారాలు అలాగే హోలీ సెలవును మినహాయిస్తే కేవలం 9 ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ 6,723 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 2,027 పాయింట్లు తగ్గింది. ఈ 9 రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.33.68 లక్షల కోట్లు తగ్గింది. దీంతో యుద్ధం ప్రభావం ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగులుస్తోంది.

మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్లకు ఇప్పటివరకు మార్చి నెల అత్యంత కష్టకాలంగా మారింది. అదే విధంగా ఈ వారం అత్యంత అధ్వానంగా నిలిచే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు అమెరికా టారిఫ్ ప్రభావం, అలాగే ఆంథ్రోపిక్ వంటి ఏఐ టూల్స్ కారణంగా ఐటీ కంపెనీలపై మాత్రమే ఎక్కువ ఒత్తిడి కనిపించింది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడు యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడం మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. ఫలితంగా అనేక ప్రధాన కంపెనీల షేర్లు వరుసగా పడిపోతూ.. కొన్ని స్టాక్స్ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిలను తాకాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...