Homenewsవిశాఖవాసులకు ఆర్టీసీ బంపరాఫర్.. కేవలం రూ.100 మాత్రమే, ఇకపై 24 గంటలు

విశాఖవాసులకు ఆర్టీసీ బంపరాఫర్.. కేవలం రూ.100 మాత్రమే, ఇకపై 24 గంటలు

Published on

spot_img

విశాఖపట్నం వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త. రూ.100తో ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్ కొంటే 24 గంటల పాటు నగరంలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. గతంలో రాత్రి 12 గంటలకు ముగిసే గడువును సడలించారు. ఈ సౌకర్యం నగరంలోని అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. ప్రయాణికుల వివరాలు కండక్టర్‌కు అందించాలి. డబుల్ డెక్కర్ బస్సుల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి

విశాఖపట్నంవాసులకు ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఇకపై రూ.100తో ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్ కొనుగోలు చేస్తే.. నగర పరిధిలో 24 గంటల పాటు ఎన్నిసార్లు, ఎన్ని బస్సులు మారైనా ప్రయాణించవచ్చు. మధురవాడ డిపో మేనేజర్ ఈ విషయాన్ని తెలియజేశారు. గతంలో ఈ గడువు రాత్రి 12 గంటలకే ముగిసేది.. రాత్రి 11 గంటలకు టికెట్ తీసుకుంటే, కేవలం ఒక గంట మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఈ సమయాన్ని సడలించారు.. ఉదాహరణకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టికెట్ తీసుకుంటే.. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ సౌకర్యం నగర పరిధిలో తిరిగే అన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనతో తరచుగా బస్సుల్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది ప్రయాణికుల ఖర్చును తగ్గించడమే కాకుండా, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...