
విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇలా ఫ్లైఓవర్, మెట్రో లైన్ పనులు కలిపి చేపడితే.. రెండు నాగరాల్లో.. NHAI, మెట్రో రైలు కార్పొరేషన్లకు రూ. 563 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ వేర్వేరుగా నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవడంతో పాటు.. నగరాల్లో భూసేకరణ వ్యయం కూడా అదనపు భారం అవుతుంది
ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ను వేర్వేరుగా నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక నగరాల్లో భూసేకరణ వ్యయం కూడా అదనపు భారం. ఈ సమస్యను పరిష్కరించడానికి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లో.. కింద వాహనాలు, పైన మెట్రో రైలు పరుగులు పెడుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని మహారాష్ట్రలోని నాగ్పూర్లో అమలు చేస్తున్నారు. హైదరాబాద్లోనూ డబులు డెక్కర్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో.. జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సిద్ధమైంది
