
విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి, వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్కు సరికొత్త నిర్వచనం చెబుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన వేదిక అని చాటి చెప్పారు. గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికారు.. ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. ఇవాళ కూడా భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు
విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర కొనసాగుతోంది.. సాగర తీర నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. గత రెండు రోజులుగా రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది
