
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉన్నారు. అంతేకాకుండా శ్రీ సత్యసాయి బాబా ఉత్సవాలకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాగా, 9 కేజీల బంగారంతో తయారు చేసిన బాబా ఉత్సవ మూర్తిని మంగళవారం వెండి రథంపై ఊరేగించారు.
మంగళవారం (నవంబర్ 18) పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయిబాబా శివైక్యం తర్వాత జరుగుతున్న అదిపెద్ద వేడుకలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రశాంతి నిలయానికి చేరుకుని.. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ వెంట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆ తర్వాత హిల్ వ్యూ స్టేడియానికి మోదీ వెళ్లారు. దీంతో, హిల్ వ్యూ ఆడిటోరియం మొత్తం ఎస్పీజీ భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లింది. కాగా, పుట్టపర్తిలోని సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నేపథ్యంలో.. ప్రశాంత నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల భవనాలన్నీ రంగు రంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు
