టెన్త్ టు పీజీ వరకు చదివారా.. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.. రెడీగా ఉండండి

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ‘కౌశలం’ సర్వే ద్వారా పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించనుంది. సచివాలయాల్లోనే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించి, అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వెబ్‌ కెమెరాలు, హెడ్‌ ఫోన్లు సిద్ధం చేశారు. త్వరలోనే ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం’ పేరుతో సర్వే నిర్వహించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారి వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానంలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా, ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన వెబ్‌ కెమెరాలు, హెడ్‌ ఫోన్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సచివాలయంలో ఇద్దరు సిబ్బందికి ఆన్‌లైన్ నమూనా పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు వారి ఫోన్ నంబర్లకు లేదా ఈ-మెయిల్ ఐడీలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని పంపనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...