ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా

Date:

ఒడిశా టు వేటపాలెం..గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు చీరాల పోలీసులు. అదే సమయంలో గంజాయి సేవిస్తున్న గ్యాంగ్‌ కూడా పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చీరాల రూరల్‌ సీఐ శేషగిరిరావు తెలిపారు. ప్రభాకర్ జేన నెట్‌వర్క్, అతనికి సహకరిస్తున్న వారి గురించి వివరాలు ఆరాతీస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకునితో పాటుగా గంజాయి సేవించేందుకు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను బాపట్ల జిల్లా చీరాల రురల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గరి నుంచి 1250 గ్రాముల నిషేధిత గంజాయితో పాటు వేయి రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వేటపాలెం జబ్బార్ కాలనీ లో నివాసముంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ జేన..ఒడిశా నుంచి వేటపాలెంకి కూలీలను పనికి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో ఒడిశా లోని తన స్నేహితుడు అనిల్ గౌడ్ దగ్గర తక్కువ ధరకు నిషేధిత గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...