బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్

Date:

ఏపీలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత ఉన్నట్టుండి వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురిశాయి. విశాఖపట్నంలో గురువారం రాత్రి వరకు భారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌‌లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. శుక్రవారం, శనివారం వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయంటున్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈ నెల 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో వర్షం పడింది. విశాఖపట్నంజిల్లా బుచ్చిరాజుపాలెంలో 9.17 సెంటీమీటర్లు, మహారాణిపేటలో 8.9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 8.62 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు సరిగా పడలేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురవడంతో రైతులకు కాస్త ఊరట దక్కింది. ఈ వర్షాలు సరిపోవని కూడా అంటున్నారు.. ఈ నెలలో అల్పపీడనం ఏర్పడుతుందనే అంచనాలపై ఆశలు పెట్టుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...