
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయించింది. డిగ్రీలో. బీఎస్సీకి రూ.17,500, బీకాం రూ.14వేలు, బీఏ రూ.13 వేలు, బీ ఒకేషనల్ రూ.17,500గా నిర్ణయించారు. బీహెచ్ఎంకు రూ.35 వేలు, బీబీఏ/బీబీఎం రూ.21 వేలు, బీసీఏ రూ.21 వేలు, కనీస ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ కోర్సుల్లో ఎల్ఎల్బీ (మూడేళ్లు) రూ.16 వేలు, ఎల్ఎల్బీ (ఐదేళ్లు) రూ.15 వేలు, ఎంఎల్/ఎల్ఎల్ఎం రూ.22 వేలు. ఫార్మా కోర్సుల్లో బీ-ఫార్మసీ రూ.45 వేలు, ఫార్మా-డీ రూ.45 వేలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, ఫార్మసీ, న్యాయ విద్యకు సంబంధించి తాత్కాలిక ఫీజులను ఖరారు చేసింది. ఈ ఏడాది గతేడాది ఫీజుల కంటే 17.5% పెంచింది. వాస్తవానికి ప్రతి మూడేళ్లకోసారి వృత్తి విద్యా కోర్సులకు ఫీజులు నిర్ణయిస్తారు.. గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు 2025-26 విద్యా సంవత్సరంతో ముగియడంతో ఈ ఏడాది ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. కానీ కొత్త ఫీజుల్ని నిర్ణయించడంలో ఆలస్యం కావడంతో.. ప్రస్తుతం తాత్కాలికంగా ఫీజుల్ని ఖరారు చేశారు. ఫైనల్గా ఫీజుల నిర్ణయం వచ్చే వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
డిగ్రీ కోర్సులు.. బీహెచ్ఎం, బీహెచ్ఎంసీటీకి రూ.35వేలు.. బీబీఏ, బీబీఎం-రూ.21 వేలు.. బీసీఏ- రూ.21వేలు.. బీఎస్సీకి రూ.17,500.. బీ.వొకేషనల్- రూ.17,500.. బీకామ్-రూ.14వేలు.. బీఏ-రూ.13 వేలు ఫీజును ఖరారు చేశారు. బీఫార్మసీకి రూ.45 వేలు.. ఫార్మాడీ-రూ.45 వేలు.. ఎల్ఎల్బీ మూడేళ్లకు రూ.16 వేలు.. ఐదేళ్ల కోర్సుకు రూ.15వేలు.. ఎంఎల్, ఎల్ఎల్ఎంకు రూ.22 వేలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాదు ఇటీవల ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.. ఈ తాత్కాలిక ఫీజులతో కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కానీ తుది ఫీజులను ఈ అడ్మిషన్లకు అమలు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ నెల 5 నుంచి విద్యార్థుల రిజిస్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కామన్ అడ్మిషన్స్ పోర్టల్లో ఈ నెల 11 వరకు విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. అనంతరం ఈ నెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలిస్తారు.. ఈ నెల 15 నుంచి 19 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 20న ఆప్షన్ల మార్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 26న సీట్లు కేటాయిస్తారు.. 27 నుంచి తరగతులు ప్రారంబిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యార్థులు తమ అడ్మిషన్లను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్లో, కాలేజీ లాగిన్ ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు ఆప్షన్లు కాలేజీ లాగిన్ ద్వారా పెట్టుకుంటే అదే మొదటి ప్రాధాన్యగా ఉంటుంది.

