
దేశంలో మరణశిక్ష అమలుకు ప్రస్తుతం ఉరి తీయడం మాత్రమే ప్రామాణికమైన, రాజ్యాంగబద్ధమైన విధానమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఉరిశిక్ష విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అయితే భవిష్యత్తులో మరింత విశ్వసనీయమైన, అత్యున్నత స్థాయి శాస్త్రీయ ఆధారాలు అందుబాటులోకి వస్తే.. ప్రత్యామ్నాయ విధానాలపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయవచ్చని స్పష్టం చేసింది.
మొత్తంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఉరిశిక్ష అమలుకు ఎలాంటి ప్రత్యామ్నాయ పద్ధతిని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. అయితే శాస్త్రీయ ఆధారాలు, పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ అంశాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.
మరణశిక్ష పడిన దోషులకు ప్రస్తుతం మన దేశంలో ఉరి ద్వారా శిక్షను అమలు చేస్తున్నారు. ఈ విధానం రాజ్యాంగబద్ధమైనదే అయినప్పటికీ.. ఉరికి బదులుగా తక్కువ నొప్పితో కూడిన విషపు ఇంజెక్షన్ లేదా ఇతర ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉరి ద్వారా మరణశిక్ష అమలు చేయడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రవేశపెట్టాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
దీంతో ప్రస్తుతం దేశంలో మరణశిక్ష అమలుకు ఉరి తీయడమే ప్రామాణిక విధానంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లైంది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మరణశిక్ష పడిన ఖైదీలకు తక్కువ నొప్పి కలిగేలా, వారి గౌరవానికి భంగం కలగకుండా ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇతర విధానాలను అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు వేర్వేరు తీర్పులను లార్జర్ బెంచ్కు నివేదించాలని పిటిషనర్ కోరారు. అయితే, అలా చేయడానికి తగిన న్యాయపరమైన ప్రాతిపదికలు లేవని ప్రస్తుత ధర్మాసనం స్పష్టం చేసింది.
సీఆర్పీసీ సెక్షన్ 354(5) ప్రకారం అమలు చేస్తున్న ఉరిశిక్ష అత్యంత బాధాకరమైనదని, అమానుషమైనదని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. అందువల్ల ఖైదీకి తక్కువ బాధ కలిగించే ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు.

