
గత నాలుగు నెలల్లోనే 22 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పులు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి దాదాపు 100 హత్య కేసులను అధికారులు బదిలీ చేశారు. వరుసగా మరణశిక్షలు విధిస్తుండటంతో న్యాయవాదులు, పిటిషనర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులను ఇకపై జిల్లా, సెషన్స్ కోర్టులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ ఏయే కేసుల్లో మరణశిక్షలు విధించారు? ఆ తీర్పుల వెనుక ఉన్న అంశాలేమిటి? ఇప్పుడు వాటిపై ఓసారి వివరంగా తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ న్యాయశాఖలో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముజఫ్ఫర్నగర్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను ఇతర న్యాయమూర్తికి బదిలీ చేశారు.
అయితే, గత నాలుగు నెలల్లోనే రవికుమార్ దివాకర్ ఏకంగా 22 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పులు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను ఇతర న్యాయమూర్తికి బదిలీ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
వరుసగా మరణశిక్షలు విధిస్తున్న తీర్పులపై న్యాయవాదులు, పిటిషనర్లు, దోషుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఈ కేసుల బదిలీకి కారణమేంటి? గత నాలుగు నెలల్లో రవికుమార్ దివాకర్ ఇచ్చిన సంచలన తీర్పులేమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
కేసుల బదిలీకి కారణం ఇదే.. అసలెవరీ జడ్జి రవికుమార్ దివాకర్?
ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉన్న అత్యంత తీవ్రమైన కేసులను జడ్జి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.
వరుసగా మరణశిక్షలు విధిస్తున్న నేపథ్యంలో న్యాయవాదులతో పాటు కేసులతో సంబంధం ఉన్న వ్యక్తుల్లోనూ ఆందోళన పెరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి తెలిపారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న అనంతరం కీలక కేసులను మరో కోర్టుకు బదిలీ చేసే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎవరీ రవికుమార్ దివాకర్?
లక్నోకు చెందిన 46 ఏళ్ల రవికుమార్ దివాకర్ 2009లో ఆజంగఢ్లో అదనపు సివిల్ జడ్జిగా న్యాయ వృత్తిని ప్రారంభించారు. 2015లో సుల్తాన్పూర్లో సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టి, అనంతరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్గా పదోన్నతి పొందారు.
బీకామ్, ఎల్ఎల్ఎం విద్యను అభ్యసించిన ఆయన 2025 నవంబర్ నుంచి ముజఫర్నగర్లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అయితే 2022లో వారణాసిలోని గ్యాన్వాపి కాంప్లెక్స్లో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో రవికుమార్ దివాకర్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఈ కేసుతో ఆయన పేరు జాతీయ స్థాయిలో ప్రముఖంగా చర్చకు వచ్చింది.

