సైబర్ వలలో సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి.. రూ.10.91 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Date:

సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు వల విసరగా.. రూ.10.91 లక్షలు పొగొట్టుకున్నారు. దీంతో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమె బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగం కావటం గమనార్హం.

సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్దతుల్లో  బురిడీ కొట్టిస్తున్నారు. అయితే వీరి వలలో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు, వర్గాలకు చెందిన వారు కూడా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సైబర్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి రూ.కోట్లు కొట్టేశారు. బంగారం సైతం తాకట్టు పెట్టి ఆమె పెట్టుబడులు పెట్టింది. తాజాగా.. సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి సైతం సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయారు

సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరుతో వచ్చిన ఫేక్ పెట్టుబడుల వీడియో ప్రకటన చూసి ఆయన భార్య బీవీ విజయలక్ష్మి రూ.10.91 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ వెంటనే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మి బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేయటం గమనార్హం. గతేడాది డిసెంబరులో సామాజిక మాధ్యమాల్లో నిర్మలా సీతారామన్‌ పేరుతో ఒక పెట్టుబడి ప్రకటన చూశారు. సెబీ ఆధ్వర్యంలో ట్రేడింగ్‌లో పెట్టుబడులకు అవకాశముందని నమ్మించారు. క్వాంటాపల్స్‌ సంస్థ ఇందుకు సేవలు అందిస్తోందని చెబుతూ ప్రకటన కింద ఉన్న లింక్‌ ఉంచారు. విజయలక్ష్మి లింక్ మీద క్లిక్‌ చేయగా.. ఆర్థిక సలహాదారు ఆదిత్య సుబ్రహ్మణ్యం పేరుతో వాట్సాప్‌లో విజయలక్ష్మికి ఒకరు పరిచయమయ్యారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...