
- సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి అంచున ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ పరోక్షంగా జట్టు మేనేజ్మెంట్పై విమర్శలు ఎక్కుపెట్టారు. మొదటి టెస్ట్ను 30 పరుగుల తేడాతో ఓడిన భారత్.
- గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్లో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ విజయం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో టీమ్ మేనేజ్మెంట్లో చేసిన అనవసర మార్పులే ఈ వైఫల్యానికి కారణమని వికాస్ కోహ్లీ తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు.
- వికాస్ కోహ్లీ తన థ్రెడ్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన నేరుగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు కోచ్, ప్రస్తుత మేనేజ్మెంట్ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. “ఒకప్పుడు విదేశీ పిచ్లపై కూడా గెలవడానికి ఆడేవాళ్ళం.
- ఇప్పుడు మన దేశంలో కూడా మ్యాచ్ కాపాడుకోవడానికి ఆడుతున్నాం. బాగున్న సిస్టమ్లో అనవసరంగా పెత్తనం చేసి, మార్పులు చేస్తే ఇలాగే జరుగుతుంది” అని వికాస్ కోహ్లీ ఆ పోస్ట్లో ఘాటుగా రాశారు.
- ప్రస్తుత టీమిండియా మేనేజ్మెంట్లో కోచ్గా గౌతమ్ గంభీర్తో పాటు, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్, టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నారు. కోచ్ గంభీర్ సారథ్యంలో భారత టెస్ట్ ప్రదర్శన క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆయన పదవీకాలంలో జట్టు గెలుపు కంటే ఓటములనే ఎక్కువగా నమోదు చేసింది. ముఖ్యంగా సొంతగడ్డపై కూడా టీమిండియా కష్టపడటం ఆందోళన కలిగిస్తోంది.
