Homenewsఏపీ మంత్రి పేరుతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖ.. తిరుమల వెళ్లిన భక్తులకు ఊహించని...

ఏపీ మంత్రి పేరుతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖ.. తిరుమల వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

Published on

spot_img

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు కలకలం రేపుతున్నాయి. దళారులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు జారీ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి పేరుతో లేఖలు జారీ అవుతున్నాయని బాధితులు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం బయటపడింది. కొందరు వ్యక్తులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ సిఫారసు లేఖలు సృష్టిస్తున్నారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖల అంశంపై మంత్రి పీఏ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌, నకిలీ లేఖల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ సిఫారసు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టీటీడీ సిఫారసు లేఖల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...