ఏపీ మంత్రి పేరుతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖ.. తిరుమల వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

Date:

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు కలకలం రేపుతున్నాయి. దళారులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు జారీ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి పేరుతో లేఖలు జారీ అవుతున్నాయని బాధితులు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం బయటపడింది. కొందరు వ్యక్తులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ సిఫారసు లేఖలు సృష్టిస్తున్నారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖల అంశంపై మంత్రి పీఏ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌, నకిలీ లేఖల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ సిఫారసు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టీటీడీ సిఫారసు లేఖల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...