హైదరాబాద్‌లో వైసీపీ కీలక నేత అరెస్ట్.. న్యూస్ ఛానల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు కొంప ముంచాయి

Date:

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు బస్సు ప్రమాదంపై చేసిన వ్యాఖ్యలు, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగిందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీలో వెంకట్‌రెడ్డిపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీశ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అనంతపురం తాడిపత్రి సమీపంలో రైల్వేట్రాక్‌ పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాం కనిపించింది.. ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. సతీశ్ కుమార్ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...