కొండెక్కిన కోడి గుడ్డు ధరలు.. డజను గుడ్లు ఎంతో తెలుసా?

Date:

అమరావతి, నవంబర్‌ 18: కార్తీక మాసం చివరికి వచ్చినా నిత్యవసరాల ధరల మోత తగ్గడం లేదు. మోంథా తుపాను సాకుతో రైతులు కూరగాయల ధరలు మండిస్తున్నారు. ఇక దళారుల సంగతి సరేసరి. వీళ్లు ఆడిందే ఆటగా జోరుగా దందా సాగిస్తున్నారు.

కారీక మాసం ఆరంబానికి ముందున్న పరిస్థితులు ప్రస్తుతానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కిలో రూ.20 అమ్మిన కూరగాయలు ఇప్పుటు సెంచరీ కొడుతున్నాయి. ఓ వైపు పెరిగిన కూరగాయల ధరలు సామాన్య, మధ్య తరగతి జనాలకు చుక్కలు చూపిస్తుంటే.. మరో వైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

కూరగాయలు ఎక్కువ శాతం కిలో వంద రూపాయలకు చేరుకుంటే.. కోడిగుడ్డు సైతం తగ్గేదే లే.. అంటూ ఏడు రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు వీటిని కొనే మార్గంలేక లభోదిభోమంటున్నారు. ప్రస్తుతం కార్తిక మాసం ఉపవాసాలతోపాటు అయ్యప్ప దీక్షలు కూడా తీసుకునే సమయం.

ఈ సమయంలో గుడ్లు వినియోగం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి గుడ్డు ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. గత నెలలో రూ.5 నుంచి రూ.6 విక్రయించిన గుడ్డు.. ప్రస్తుతం రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతుంది. ఇక డజను గుడ్లు రూ.98 వరకు పలుకుతున్నాయి. దీంతో జనాలు గుడ్లు కొనేందుకు ఆలోచిస్తున్నారు.

ఇక అక్టోబరులో కిలో చికెన్‌ రూ.240 నుంచి రూ.260 ఉంటే.. ప్రస్తుతం రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గింది. మాంసం ధరలు తగ్గితే గుడ్డురేటు మాత్రం పెరగడం పైపైకి వెళ్లడం విడ్డూరంగా ఉంది. మరోవైపు తెలంగాణలోనూ గుడ్లు, కూరగాయల ధరలు ఇదే మాదిరి చుక్కలు చూపిస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...