మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

Date:

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం పదో తరగతి పరీక్షలకు ముందు.. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా టెన్త్‌ పరీక్షల్లో బాగా మార్కులు వచ్చిన విద్యార్థులను గుర్తించి.. వారిని 3 రోజుల ఢిల్లీ టూర్‌కి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతిని కూడా కలిసే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి .. తన నిర్ణయాలతో తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలె తన వద్ద పనిచేసే పీఏ పదవికి ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసి.. అందరి నుంచి ప్రశంసలు పొందిన గల్లా మాధవి తాజాగా.. మరో నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి విద్యార్థులను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లి.. మళ్లీ తీసుకురానున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం.. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విమానం ఎక్కిస్తానని గల్లా మాధవి.. హామీ ఇవ్వడం గమనార్హం. ఇచ్చిన మాట ప్రకారం.. వారిని విమానం ఎక్కించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు

తన నియోజకవర్గం పరిధిలో ఉన్న పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు.. ఈ పరీక్షల్లో 550 మార్కుల కంటే ఎక్కువ ఎంతమంది తెచ్చుకుంటే.. వారందరినీ విమానంలో టూర్‌కు తీసుకువెళ్తానని ఆమె గతంలో మాట ఇచ్చారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం గుంటూరు అర్బన్‌ జిల్లాలోనే ఉంటుంది. ఈ పరిధిలో మొత్తం 8 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. ఆ స్కూళ్లలో చదివిన విద్యార్థుల్లో మొత్తం 39 మందికి.. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో 550పైగా మార్కులు వచ్చాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...

ఏపీలోని గ్రామాల్లో కొత్త సర్వే.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు....