హైదరాబాద్‌లో వైసీపీ కీలక నేత అరెస్ట్.. న్యూస్ ఛానల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు కొంప ముంచాయి

Date:

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు బస్సు ప్రమాదంపై చేసిన వ్యాఖ్యలు, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగిందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీలో వెంకట్‌రెడ్డిపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీశ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అనంతపురం తాడిపత్రి సమీపంలో రైల్వేట్రాక్‌ పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాం కనిపించింది.. ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. సతీశ్ కుమార్ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన స్కీమ్‌..!

Post Office Gram Suraksha Scheme: రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను...

చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా,...

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో...