బంగారం ధరల షాక్.. ఒక్కరోజులోనే రూ.3,770 పెరుగుదల, వెండి కూడా భారీ జంప్!

Date:

బంగారం మళ్లీ భగ్గుమంది.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల, వెండి కూడా పరుగులు

గత రెండు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజుల్లో ఎంత మేర తగ్గాయో, దాదాపు అంతే స్థాయిలో నేడు ఒక్కరోజులోనే పెరగడంతో పసిడి ప్రియులు నిరాశకు గురయ్యారు. ఈరోజు తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.3,770 పెరగగా, కిలో వెండి ధర రూ.5,000 ఎగబాకింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.14,455గా నమోదైంది. 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.13,250గా, 18 క్యారెట్ల (75 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.10,841గా ఉంది.

అదే విధంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,700గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650గా కొనసాగుతోంది.

ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,50,000కు చేరుకోగా, ఢిల్లీలో కిలో వెండి ధర కూడా రూ.5,000 పెరిగి రూ.2,45,000 వద్ద విక్రయమవుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....