నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో…

Date:

సికింద్రాబాద్: లష్కర్‌ బోనాల పండుగ అంటే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు. ఈ పండుగకు నగరం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనార్ధం భక్తులు వస్తుంటారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ ఉత్సవాల్లో పలు వృత్తులవారు, కులాలవారు సేవలందించడం ఆనవాయితీగా వస్తోంది. సంవత్సరమంతా ఎక్కడ ఉన్నా ఈ ఆషాఢ మాసం మొదలయిందంటే అమ్మవారి సేవకు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో తమ పనుల్లో నిమగ్నమవుతారు.

అమ్మవారికి పలు కులాల వారు తమకు తోచిన విధంగా సేవలందిస్తుంటారు. అందులో ప్రధానంగా బ్రాహ్మణ, ముదిరాజ్‌, కుమ్మరి, చాకలి ఇలా పలు కులాలవారు సేవలు చేస్తుంటారు. పదిహేను సంవత్సరాలుగా పోతరాజుగా అమ్మవారికి సేవ చేస్తున్నా. సురిటి కామేశ్వర్‌ ముదిరాజ్‌ ఈ అవకాశం కల్పించారు. గతంలో పోతరాజు దినే్‌షతో కలిసి సేవ చేసేవాడిని. ప్రస్తుతం దేవరాజ్‌, నర్సింగ్‌, భాస్కర్‌లతో కలిసి పోతరాజులుగా సేవలందిస్తున్నాం.

అమ్మవారి ఘటోత్సవం రోజు అమ్మవారిని ఆలయానికి తీసుకువచ్చినప్పటి నుంచి భవిష్యవాణి అనంతరం అమ్మవారిని సాగనంపే వరకు సేవలు అందిస్తుంటాం. ఏ రోజు, ఏ బస్తీలో ఘటం వస్తుందో ఆ రోజు తెల్లవారుజామునే డప్పు వాయిస్తూ అమ్మవారి రాకను అందరికీ తెలిసేలా చేస్తుంటా. దీంతో బస్తీవాసులు అమ్మవారి రాకకు ఎదురుచూస్తుంటారు. ఘటం రూపంలో అమ్మరాగానే సాకలు పోసి, ఒడి బియ్యాన్ని భక్తులు సమర్పిస్తుంటారు. నాలుగు తరాలుగా అమ్మవారికి మా వంశం ఈ సేవలను అందిస్తుంది.

దాదాపు 50 ఏళ్లుగా వంశపారంపర్యంగా అమ్మవారి సేవలో మా కుటుంబం కొనసాగుతుంది. మా తాత, మా తండ్రి అమ్మవారి సేవలో కొనసాగేవారు. మేము ఘటం వెంట తిరిగి ఒడి బియ్యాన్ని సేకరిస్తాం. రంగం రోజు ముందుగా బలిగంపకు అవసరమయ్యే వస్త్రాలు, జల్లకడవను తీసుకువస్తాం. మా తండ్రి తదనంతరం గత సంవత్సరం నుంచి నేనే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....