ఏపీ మంత్రి పేరుతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖ.. తిరుమల వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

Date:

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు కలకలం రేపుతున్నాయి. దళారులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు జారీ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి పేరుతో లేఖలు జారీ అవుతున్నాయని బాధితులు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం బయటపడింది. కొందరు వ్యక్తులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ సిఫారసు లేఖలు సృష్టిస్తున్నారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖల అంశంపై మంత్రి పీఏ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌, నకిలీ లేఖల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ సిఫారసు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టీటీడీ సిఫారసు లేఖల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన స్కీమ్‌..!

Post Office Gram Suraksha Scheme: రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను...

చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా,...

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో...