
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటి వరకు రాజమండ్రి జైలులో ఉన్న నాగరాజును ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నాగరాజును ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. ఈ పోలీసు కస్టడీతో సాయికృష్ణ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటి వరకు రాజమండ్రి జైలులో ఉన్న నాగరాజును ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నాగరాజును ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. ఈ పోలీసు కస్టడీతో సాయికృష్ణ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
ఈ కేసులో ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలులో కాకుండా పోలీసుల కస్టడీలోనే నాగరాజును విచారించాలని తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం విజయవాడ కోర్టుకు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నాగరాజును ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమేసిట్ అధికారులు విచారించాలని స్పష్టం చేసింది. విచారణ సమయం ముగిసిన తర్వాత కూడా నాగరాజుకు భద్రత కల్పించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఉంచాలంటూ న్యాయ స్థానం ఆదేశించింది. విజయవాడ కోర్టు అనుమతి అనంతరం నాగరాజును సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

