సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె మహిళల వార్డు సమీపంలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిలిచింది.

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె మహిళల వార్డు సమీపంలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిలిచింది.
అదే సమయంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో చంటిపాపను ఎత్తుకుని నిల్చొని ఉన్న ప్రవళికను గమనించిన ఆయన, ఆమెను పలకరించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన భర్త ఇంట్లో లేడని, పాపకు ఫిట్స్ రావడంతో ఒక్కదాన్నే ఆస్పత్రికి తీసుకొచ్చానని ప్రవళిక వివరించింది.
దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి, తల్లీబిడ్డను తన అధికారిక కారులో ఎక్కించుకుని మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్)కు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులతో స్వయంగా మాట్లాడి, చిన్నారికి ఆలస్యం కాకుండా అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో వైద్య సిబ్బంది వెంటనే చికిత్స ప్రారంభించారు.

