
ఏపీలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిలయన్స్ సహకారంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెలాఖరులో అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సంస్థ అందుబాటులోకి వస్తే వ్యవసాయ విద్య, పరిశోధన, ఆధునిక సాగు విధానాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధనలకు కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. రిలయన్స్ సంస్థ సహకారంతో ఐఎస్ఏను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దే యోచనలో ఉన్నారు.
ఐఎస్ఏ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరులో రిలయన్స్తో అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ యూనివర్సిటీలు ఇప్పటికే ఉన్నాయి. వీటిలో వివిధ సంప్రదాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐఎస్ఏలో మాత్రం వాటికి భిన్నంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్య, పరిశోధనకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ సుస్థిరత వంటి ఆధునిక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్, డిజిటల్ అగ్రికల్చర్లో మాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వంటి ప్రపంచస్థాయి కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ విధంగా వ్యవసాయ రంగానికి అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ నైపుణ్యాలు కలిగిన నిపుణులను తీర్చిదిద్దేలా ఐఎస్ఏను అభివృద్ధి చేయనున్నారు.

