
ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జెవార్)లో భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోవడం రాజకీయ దుమారం రేపింది. టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం జలమయం కావడంతో.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విమానాశ్రయంలో విమానాల స్థానంలో పడవలు నడుపుతారా అంటూ ప్రశ్నించారు. అయితే దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందిస్తూ.. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా కొద్దిసేపు నీరు నిలిచిందని తెలిపారు. సుమారు అరగంటలోనే నీటిని తొలగించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జెవార్ ఎయిర్పోర్ట్)లో భారీ వర్షం రాజకీయ దుమారం రేపింది. మంగళవారం కురిసిన వర్షానికి విమానాశ్రయ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విమానాశ్రయంలో విమానాలు నడుస్తాయా.. లేక పడవలు నడపాల్సి వస్తుందా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది.
టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిలిచిన నీటిని తొలగించేందుకు విమానాశ్రయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న 28 సెకన్ల వీడియోను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ వీడియోపై స్పందిస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఇప్పుడు ఈ విమానాశ్రయంలో విమానాలకు బదులుగా పడవలు నడుపుతారా?” అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. దీంతో ఈ వీడియోకు సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందన లభించింది.

