వర్షాకాలంలో ఇంట్లో నాటాల్సిన 5 పవిత్ర మొక్కలు

Date:

ఈ వర్షాకాలంలో ఇంటి ఆవరణలో లేదా కుండీల్లో కొన్ని పవిత్రమైన మొక్కలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తులసి, మందారం, మల్లె, పారిజాతం, బిల్వం వంటి మొక్కలను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా పరిగణిస్తారు. వీటిని ఇంట్లో పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇంటికి శుభం, సానుకూలత, ఐశ్వర్యం కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు త్వరగా వేళ్లూనుకుని ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది.

అపరాజిత మొక్కకు ఉన్న ప్రత్యేకత

నీలం, తెలుపు రంగుల్లో అందమైన పువ్వులు పూసే అపరాజిత మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొక్క విష్ణుమూర్తికి, శివునికి ప్రీతికరమైనదని నమ్మకం. వర్షాకాలంలో వర్షపు నీరు అందడంతో అపరాజిత తీగలు వేగంగా పెరిగి చుట్టూ అల్లుకుంటాయి. ఇంట్లో అపరాజిత మొక్కను పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది.

మనీ ప్లాంట్

ఆర్థిక అభివృద్ధి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే మనీ ప్లాంట్‌ను వర్షాకాలంలో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. వాస్తు, సంప్రదాయ విశ్వాసాల ప్రకారం దీనిని ఆగ్నేయ దిశలో నాటితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని నమ్ముతారు. అందుకే వర్షాకాలంలో మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం శుభప్రదంగా భావిస్తారు.

పారిజాతం / హర్‌సింగార్

పారిజాతం లేదా హర్‌సింగార్ పువ్వులు తమ అందమైన రూపంతో పాటు మధురమైన సువాసన, పవిత్రతకు ప్రసిద్ధి చెందాయి. పురాణాల ప్రకారం పాలసముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఈ పవిత్ర వృక్షం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారు. వర్షాకాలంలో పారిజాతం మొక్కను ఇంట్లో నాటడం వల్ల పరిసరాలు ఆహ్లాదకరంగా మారడంతో పాటు ప్రతికూల శక్తులు తొలగిపోయి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని విశ్వసిస్తారు.

శమి మొక్క విశిష్టత

శమి మొక్క శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. జాతకంలో శని దోషాలు ఉన్నవారు వర్షాకాలంలో శమి మొక్కను నాటి, ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం. అలాగే రాహు-కేతు దోషాల ప్రభావం కూడా తొలగి, ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని విశ్వసిస్తారు.

తులసి మొక్క విశిష్టత

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వర్షాకాలంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల పరిసరాలు ఆహ్లాదకరంగా మారడంతో పాటు, మొక్కలు వాతావరణానికి ఆక్సిజన్ అందించడంలో సహాయపడతాయి. అలాగే ఇంట్లో శ్రేయస్సు, సానుకూలత కలుగుతాయని విశ్వాసం. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రతిరోజూ తులసి కోట వద్ద దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...