ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!

Date:

ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత తొలిసారి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనం, ఉదారతను బలహీనతగా భావించవద్దని, అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శత్రువుపై గట్టిగా దెబ్బకొట్టగల సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు.

డిస్కవరీ రూపొందించిన ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ డాక్యుమెంటరీలో దోవల్ ఈ విషయాలను వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్‌ ప్రధాన లక్ష్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమేనని తెలిపారు.

2025 ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్‌ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి, పాకిస్థాన్‌, పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, మే 10న కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది.

రెండు భాగాలుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ఆపరేషన్ వెనుక జరిగిన నిర్ణయ ప్రక్రియ, వ్యూహాలు, కీలక పరిణామాలను దోవల్‌తో పాటు భారత భద్రతా వ్యవస్థకు చెందిన అధికారులు వివరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...