రైలు ప్రయాణికులకు అలెర్ట్.. మెమో రైళ్లు రద్దు, ఎప్పటి వరకు అంటే..?

Date:

రైల్వేశాఖ మరమ్మతుల కారణంగా కొన్ని మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. నాయుడుపేట స్వర్ణముఖ నది వంతనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ కారణంతో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వచ్చే మెమో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ రైళ్లను రద్దు చేయడం, ఆ ప్రాంతంలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రద్దయిన మెమో రైళ్లు చెన్నై – సూళ్లూరుపేట నడవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నడిచే కొన్ని మెమో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నాయుడుపేట స్వర్ణముఖి నది వంతెనపై మరమ్మతుల కారణంగా పలు మెమో రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రెండు రోజులుగా పలు మెమో రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. గురువారం కూడా ఈ రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

నాయుడుపేట స్వర్ణముఖి నదిపై ఉన్న వంతెన మార్గంలో ఇనుప గడ్డర్ల స్థానంలో సిమెంట్ గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. పది రోజులుగా ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మంగళవారం సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం 8:05 గంటలకు, 10 గంటలకు వచ్చే మెమో రైళ్లు.. అలాగే నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఉదయం 10:20, సాయంత్రం 4:00 గంటలకు వచ్చే మెమో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

రద్దు చేసిన మెమో రైళ్లను చెన్నై – సూళ్లూరుపేట మధ్య నడిచేలా రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మెమో రైళ్లను రద్దు చేయడంతో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గురువారం కూడా ఈ రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మెమో రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు రద్దుకావడం బస్సు సౌకర్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వైపు వెళ్లే పలు బస్సులను కొంతకాలంగా నిలపివేయడంతో ప్రయాణికులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...