
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు పౌర్ణమి నాడు గురు, చంద్రుల మధ్య సమసప్తక, గజకేసరి యోగాల ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వల్ల అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడనుంది. సూర్యుడు కూడా చంద్రునిపై తన పూర్తి ద్రుష్టిని ప్రసరించడం వల్ల ఈ గ్రహ స్థితిని మరింత బలపరుస్తుంది. దీంతో పాటు ప్రీతి, ఆయుష్మాన్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా వృషభం సహా ఈ రాశుల వారికి జీవితంలో కొత్త వెలుగులొచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
స్నేహితులను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాన్ని తీసుకోకూడదు.
పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువు మంత్రాలను జపించి, గురువులను పూజించాలి.
వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్తులో పెట్టుబడుల నుంచి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

