అమరావతికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేంద్రం.. కీలక ప్రాజెక్ట్ రెండు నెలల్లోనే, కీలక ప్రకటన

Date:

అమరావతిలో కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక అప్డేట్ ఇచ్చారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించనున్న జీపీఆర్‌ఏ (జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామడేషన్‌) గృహ సముదాయానికి టెండర్ల దశలో ఉందన్నారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రీ-బిడ్‌ సమావేశం ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,083 కోట్లు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జూన్‌లో కేంద్రం కీలక ప్రాజెక్టును ప్రకటించింది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అత్యాధునిక వసతులతో గృహ సముదాయం నిర్మించబోతోంది. మొత్తం రూ.1,083 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో అర్హత ఉన్న బిడ్డర్ల కోసం ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం అమరావతిలో ఈ ప్రాజెక్టును ఉద్యోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిందన్నారు.

మొత్తం 28 నెలల్లో నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారని పెమ్మసాని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 1,504 నివాస యూనిట్లను 11 హై-రైజ్‌ టవర్లలో నిర్మిస్తారని.. కామన్‌ డబుల్‌ లెవెల్‌ బేస్‌మెంట్ పార్కింగ్‌ సదుపాయం ఉంటుందన్నారు. అలాగే నివాస భవనాలతో పాటు జీ+4 అంతస్తుల అనుబంధ భవనం, గెస్ట్ హౌస్, కమ్యూనిటీ హాల్, కిచెన్, డైనింగ్‌హాల్, షాపులు వంటి సదుపాయాలు ఉంటాయనన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ శాఖలలతో సమన్వయం చేయడంతో కేవలం రెండు నెలల్లోనే టెండర్ దశకు వచ్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గృహ సదుపాయంతో పాటుగా.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కోసం రూ.1,299.08 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే సీఆర్‌డీఏ రాజధానిలో 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్‌, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం నిర్మించనున్నారు. ఈ భవనాలను అత్యాధునిక ఈసీఎస్‌బీసీ-2024 బిల్డింగ్‌ కోడ్, ఎకో-నివాస్‌ సంహిత 2024 ప్రమాణాలకు తగిన విధంగా నిర్మిస్తారు.

వాస్తవానికి 2018లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణం కోసం 22.53 ఎకరాలు కేటాయించింది. ఏపీ ఎన్‌ఆర్టీకి భవనం నిర్మిస్తున్న ప్రాంతానికి పక్కనే 5.53 ఎకరాలు సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కోసం, ఐనవోలుకు సమీపంలో 17 ఎకరాల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయానికి కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...