ఇండోనేషియా గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ఎదురుగా ఫైటర్ జెట్స్ ఆ తర్వాత సీన్ ఇదే!

Date:

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిత ఇండోనేషియాకు చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. విమానాశ్రయానికి స్వయంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేరుకుని ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలకడం ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

అంతకు ముందు ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే, ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా స్నేహపూర్వక దేశాల అధినేతలకు ప్రత్యేక గౌరవ సూచకంగా ఇలాంటి ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌ను అందిస్తారు.

జూలై 6 నుంచి 8 వరకు కొనసాగనున్న ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.

అలాగే యోగ్యకార్తాలోని ప్రపంచ ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు, అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో భారత్–ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....