పీహెచ్‌సీలు సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 రకాల మెడికల్ టెస్టులు ఫ్రీ.. ఈ సేవల గురించి మీకు తెలుసా?

Date:

మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికో లేక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో వెళ్తారు. అంతేకానీ పేదవాడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యశాల వైపు మాత్రం చూడరు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వేలాది రూపాయలు వదిలించుకుంటుంటారు. కానీ.. ప్రభుత్వ వైద్యశాలల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. 60 రకాలకు పైగా వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలో చేస్తారని చాలా తక్కువ మందికే తెలసు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.

ప్రభుత్వ వైద్యశాలంటేనే చాలా మందికి చులకన. ఆ అక్కడ ఏం ఉంటాయి.. డాక్టర్ చూస్తాడు, మందుల చీటి రాసిస్తాడు అంతేగా. ఏదైనా టెస్టులు చేయించుకోవాలంటే బయటకే వెళ్లాలిగా అనుకుని ప్రైవేట్ ఆస్పత్రికో, ఆర్ఎంపీ దగ్గరకో వెళ్లి డబ్బులు వదిలించుకుంటుంటారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రులయిన పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో 60 రకాల నాణ్యమైన ఆధునిక వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు.

సామాన్యులకు ప్రభుత్వ వైద్యశాల ఎన్నో నాణ్యమైన సేవలు అందిస్తుంది. కానీ, వాటిపై అవగాహన లేక ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇచ్చే ముందులు ఎంతో మన్నికమైనవి.. రోగాలను నయం చేసేవి కూడా ఉంటాయి. కానీ, కేవలం అవగాహన లేకనే అందరూ ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్తుంటారు.

కేవలం వైద్య పరీక్షలే కాకుండా పాముకాటు, కుక్కకాటు బాధితులకు ప్రభుత్వ వైద్యశాలల్లోనే మంచి వ్యాక్సిన్ సౌకర్యం కూడా ఉంటుంది. సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు కూడా ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తుంటారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే దిశగానూఏపీ సర్కారు కార్యచరణ మొదలుపెట్టింది.

ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నాయి. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో 60 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్షయ, హెచ్‌ఐవీ, మలేరియా, షుగర్ నిర్ధారణ, లిపిడ్ ప్రొఫైల్, హెపటైటిస్ వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లలో వేలాది రూపాయలు ఖర్చు చేసి చేయించుకునే వైద్య పరీక్షలు ఇక్కడ ఉచితంగానే చేస్తారు. ప్రభుత్వ ఆసుప్రతులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఇటీవలి కాలంలో కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు సర్కారు దావఖానాల్లో వైద్యం చేయించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...