
ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అద్భుత అవకాశం కల్పించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. 340 మందికి ఈ శిక్షణ అందిస్తారు.
ఈ నెల 13 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో శిక్షణ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో యువతకు ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.
మొత్తం 340 మంది అభ్యర్థులకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు.
