కర్నూలు బస్సు దుర్ఘటనపై జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ

Date:

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం పై జాతీయ మానవహక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.

తమిళనాడు తెలుగు యువశక్తి  వ్యవస్థాపక అధ్యక్షుడు కె. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి  బస్సు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సమగ్ర యాక్షన్‌ టేకన్‌ రిపోర్టు( ఏటీఆర్‌ )ను సమర్పించినా ఇంకా ప్రమాదానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదని జగదీశ్వర రెడ్డి తెలిపారు.

రీజాయిండర్‌కు స్పందించిన కమిషన్‌ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు అధికారిక నోటీసు జారీ చేసిందని అన్నారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించాలని, నాలుగు వారాల్లోపు ఏటీఆర్‌ను సమర్పించాలని, మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 12, సెక్షన్ 13 ప్రకారం విచారణ చేపట్టాలని ఆదేశించిందని వెల్లడించారు.

ఇది కేవలం ప్రమాదం కాదు.  20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చూడలేము.  ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కుకు సంబంధించిన అంశం.  ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగాలి.  బాధ్యులెవరో బయటపడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...