రూపే డెబిట్ కార్డులపై ఆ సేవలు బంద్.. ఏప్రిల్ 1 నుంచే.. HDFC సహా బ్యాంకులన్నీ ఫాలో అవ్వాల్సిందే

Date:

మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. రూపే డెబిట్ కార్డుల ద్వారా అందిస్తున్న పలు సేవలను ఇకపై పొందలేరు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మార్చింది. పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు సైతం ఈ కొత్త మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిజిటల్ పేమెంట్ల నియంత్రణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపే డెబిట్ కార్డులకు సంబంధించి కీలక మార్పులు చేసింది. రూపే డెబిట్ కార్డులపై ప్రస్తుతం అందిస్తున్న. ఈ మేరకు బ్యాంకులకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. కొత్త రూల్స్ కారణంగా రూపే డెబిట్ కార్డు యూజర్లుకు ఇకపై ఎయిర్‌పోర్ట్, రైల్వే లాంజ్ యాక్సెస్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. కొన్ని సేవలు పూర్తిగా ఆగిపోనున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

రూపే ప్లాటినం డెబిట్ కార్డు (RuPay Platinum Debit) యూజర్లకు ఇకపై ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉండదు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌గానూ ఈ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే, మార్చి 31, 2026 వరకు మాత్రం ఈ కార్డులపై లాంజ్ యాక్సెస్ ఉంటుందని, అర్హతలు ఉన్న వారు సేవలు పొందవచ్చని తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన కార్డులకు ఖర్చు ఆధారంగా లాంజ్ యాక్సెస్ కొనసాగిస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ నిబంధన సైతం ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుంది. రూపే క్రెడిట్ కార్డు యూజర్లు తమ బ్యాంక్ నిర్దేశించిన లిమిట్ మేరకు ఖర్చు చేసి అర్హత సాధిస్తే ఎయిర్‌పోర్ట్, రైల్వే లాంజ్ యాక్సెస్ పొందవచ్చని తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....