
ఐపీఎల్ 2026కు సంబంధించి తొలి 20 మ్యాచుల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న జరిగే ప్రారంభ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ప్రతీ ఎడిషన్లో ఏయే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2026 సీజన్ మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఇక ప్రస్తుతం జరిగేది ఐపీఎల్ 19వ సీజన్. 2008లో తొలిసారిగా దేశంలో ఈ ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం అయింది. ప్రారంభ సీజన్లో కూడా తొలి జట్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. కోల్కతా నైట్ రైడర్స్తో ఆ జట్టు మ్యాచ్ ఆడింది. కాగా ఐపీఎల్ నిర్వహకులు.. సీజన్ ప్రారంభ మ్యాచ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే టోర్నీ ఆరంభ మ్యాచ్ హిట్ అయితే.. లీగ్ మొత్తం అదే జోష్ కొనసాగే అవకాశం ఉంటుందని భావిస్తారు! అందుకే స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టు తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ చేస్తారు. ఈసారి కూడా ఇదే తరహాలో ఆలోచించి.. ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు.

