భారత్, చైనాలే టార్గెట్‌గా ట్రంప్ కొత్త వ్యూహం.. తెరపైకి సెక్షన్ ‘301’ అస్త్రం.. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు

Date:

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే భారత్, చైనా సహా తమ ప్రధాన ట్రేడ్ పార్ట్‌నర్స్‌పై ఎలాగైనా సుంకాలు వసూలు చేయాలని చూస్తున్న ట్రంప్.. మరో కొత్త ఆయుధం తెరపైకి తీసుకొచ్చారు. అదే సెక్షన్ 301. దీని గురించి చూద్దాం.

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ దేశంపై ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారో తెలియట్లేదు. అప్పటికప్పుడు బాగానే ఉన్నట్లు కనిపించినా.. మరు క్షణమే అదే దేశంపై చర్యలు తీసుకున్న ఘటనలు కూడా చూశాం. ఇందులో భాగంగానే తాను గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాల్ని విధిస్తున్నారు. మెక్సికో, కెనడా, చైనా, భారత్ వంటి దేశాలపై రికార్డు స్థాయిలోనూ పెంచారు. ఈ క్రమంలోనే. అయినా తగ్గని ట్రంప్.. తమ ప్రధాన వాణిజ్య భాగస్వాములపై ఎలాగైనా టారిఫ్స్ వసూలు చేయాలని చూస్తున్నారు. దీని కోసం కొత్త దారులు వెతకుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సెక్షన్- 301 అనే ఆయుధాన్ని బయటకు తీశారు.

ఈ సెక్షన్ 301 .. భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. 1974 యూఎస్ ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద.. యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, భారత్, చైనా, నార్వే, మలేసియా, ఇండోనేసియా, కాంబోడియా, వియత్నాం, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, తైవాన్, థాయ్‌లాండ్, జపాన్, మెక్సికో దేశాలపై దర్యాప్తు జరగనున్నట్లు గ్రీర్ పేర్కొన్నారు. అయితే ఈ లిస్టులో కెనడా మాత్రం లేదు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...