విజయవాడ ఇంద్రకీలాద్రిలో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు..

Date:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజున అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు.

ప్రకృతి సంపదను ప్రతిబింబించేలా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇంద్రకీలాద్రి మొత్తం ‘జై దుర్గా.. జై జై దుర్గా’ నామస్మరణతో మార్మోగింది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాల వెనుక ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసం ఉందని భక్తులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ప్రకృతి, వ్యవసాయం, ఆహార సంపదకు ప్రతీకగా శాకంబరీ దేవిని కొలుస్తారని చెప్పుకొచ్చారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రత్యేకంగా కదంబ ప్రసాదాన్ని తయారు చేశారు. ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో సాగిన శాకంబరీ ఉత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...