స్వర్ణాంధ్ర 2047: ప్రతి నియోజకవర్గానికీ ప్రత్యేక విజన్.. యాక్షన్ ప్లాన్ యూనిట్లతో అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్!

Date:

రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు దేశంలోని గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఆలోచింపజేసింది. స్వర్ణాంధ్ర – 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలను ఒక యూనిట్ చేయడాన్ని కేంద్రం ప్రశంసించింది. ఇలా చేస్తే ప్రతి మండలం అభివృద్ధి చెందుతుందనేది ప్రభుత్వం ఆలోచన. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా చేసుకుని దానికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. విజన్ యాక్షన్ ప్లాన్‌తో యూనిట్లు ఏర్పాటు చేసింది. దీనికి ఓ వెబ్‌సైట్ కూడా ఉండగా.. త్వరలోనే యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఓపెన్ చేస్తున్నారు.

స్వర్ణాంధ్ర – 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ విజన్ యాక్షన్ ప్లాన్‌పై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఈ విధానాన్ని పరిశీలించి గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేస్తే సరిపోదని.. ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఆధారంగా విజన్ ప్రణాళికలు అమలు చేస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ స్వర్ణాంధ్ర – 2047 అమలులో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఒక్క క్లిక్‌తో సమాచారం తెలుసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. వీటితో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్న డేటా ప్రభుత్వానికి, దాన్ని పర్యవేక్షించే వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేరుతోంది. విజన్ యాక్షన్ ప్లాన్ (సీవీఏపీ) భాగంగా నియోజకవర్గ స్థాయిలో శాఖల మధ్య సమన్వయం, సమాచారం, సేకరణ, ఫలితాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి, యువ నిపుణులు, సెక్టార్ కో ఆర్టినేటర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు అభివృద్ధఇ కార్యక్రమాల వివరాలు సేకరించి.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తారు.

ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం, సంతృప్తిస్థాయి ఎలా ఉంది? ఇలాంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రణాళికల రూపకల్పన, అమల్లో భాగంగా నియోజకవర్గం ప్రొఫైల్‌తో వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. ప్రధాన పేజీల్లో నియోజకవర్గ సమాచారం కూడా కనిపిస్తుంది. మొత్తం మండలాలు, చారిత్రక అంశాలు, పర్యాటక ప్రాంతాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, సేవారంగం వాటి ప్రాధాన్యం తదితర వివరాలుంటాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దీంట్లో ప్రతి మండాలనికీ 2024-25 నుంచి 2028-29 వరకు విజన్ ప్రణాళికలున్నాయి. తాజా వివరాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. వ్యవసాయం ఆధారంగా ఆ మండలాలు ఉంటే.. ఏటా ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేయిస్తే ఎంత ఆదాయం వస్తుంది? వ్యవసాయ రంగంలో తేవాల్సిన మార్పులు, ఆధునిక సాంకేతికత, సాగునీటి సరఫరా, ప్రాజెక్టుల వివరాలని వెబ్‌సైట్‌లో పేర్కొంటారు. త్వరలో నియోజకవర్గాల వారీగా యూట్యూబ్ ఛానళ్లు కూడా ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...