జమ్మలమడుగులో వైసీపీ దీక్షల వద్ద ఉద్రిక్తత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్

Date:

జిల్లాలోని జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షల వద్ద మూడో రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన మూడో రోజు దీక్షా శిబిరం వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. శిబిరం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామసుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఆయన సతీమణి ఇందిరమ్మను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ శిబిరం వద్దకు ఎవరినీ అనుమతించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...