వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రిమాండ్.. నెల్లూరు సబ్ జైలుకు తరలింపు

Date:

పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పొగాకు వ్యాపారి కొడుకును కిడ్నాప్ చేసిన కేసులో ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. న్యాయ స్థానం ముందు వారిని హాజరపరచగా 14 రోజుల రిమాండ్ విధించి, నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో ముస్తఫా కొడుకుకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ముస్తాఫాకు నూజివీడు న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు పోలీసులు ఆయన్ను హాజరుపరచగా రిమాండ్ విధించారు. దాంతో నెల్లూరు సబ్ జైలుకు ముస్తఫాను తరలించారు. ఇదే కేసులో ముస్తఫా కుమారుడు బషీర్‌కు కూడా కోర్టు రిమాండ్ విధించింది.

పొగాకు వ్యాపారి కొడుకు కిడ్నాప్ కేసు వ్యవహారం ఇటీవల కాలంలో తీవ్ర దుమారం రేపింది. పొగాకు వ్యాపారం లావాదేవీల విషయంలో వివాదం మొదలై అది కాస్తా కిడ్నాప్ వరకూ దారి తీసింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతంలో పొగాకు సేకరించి విక్రయిస్తుంటాడు. ముస్తఫాకు గుంటూరులో ఒక పొగాకు గోదాము ఉండటంతో కొంతకాలంగా ఆయనకే పొగాకును విక్రయిస్తున్నాడు.

అయితే, ఈ మధ్య కొయ్యలగూడేనికి చెందిన వ్యక్తి ముస్తఫాకు కాకుండా మరో కంపెనీకి పొగాకు విక్రయిస్తున్నాడు. ధరల విషయంలో వ్యత్యాసం ఉండటంతోనే విక్రయించాల్సి వచ్చిందని ఆ వ్యక్తి కూడా చెప్పాడు. దాంతో పొగాకు వ్యాపారి కుమారుడు ఒక వాహనంలో పొగాకు బేళ్లను లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు బయల్దేరారు.

ఈ క్రమంలో ముస్తఫా కొడుకు పొగాకు లోడ్‌తో వస్తున్న వాహనాన్నిఅడ్డగించి, తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ పొగాకు వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయమై ముస్తఫాకు ఫోన్ చేసి అడిగితే, తనకు రావాల్సిన డబ్బులు ఇచ్చి కొడుకును విడిపించుకోవాలని చెప్పినట్టు బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...