కిడ్నాప్ కేసు గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

Date:

అమరావతి, ఆగస్టు 4: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి నిర్భంధించారంటూ వైసీపీ నేతపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముస్తఫా కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకుని వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫా అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించారు. ఇటీవల పొగాకు లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ముస్తఫా కుమారుడు, అతడి అనుచరులు అడ్డుకున్నారు. పొగాకు వ్యాపారి‌తో పాటు మరొకరిని బలవంతంగా కిడ్నాప్ చేసి, నిర్బంధించారు.

బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌కు గురైన వారిని రక్షించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. అంతేకాకుండా కిడ్నాప్‌‌లో ముస్తఫా హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కూడా కిడ్నాప్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ముస్తఫా కనిపించకుండా పోయారు. వైసీపీ నేత కోసం గాలించిన పోలీసులు చివరకు ఆయనను గుజరాత్‌లో అరెస్ట్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...