‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

Date:

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలోని బిచ్‌పాడి గ్రామానికి చెందిన 34 ఏళ్ల రవి కుమార్ యాదవ్‌గా గుర్తించారు. నీమ్రానాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రవి కుమార్ యాదవ్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జూలై 27న తన భార్య కోమల్‌ను ప్రసవం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, జూలై 28న సిజేరియన్ ద్వారా ఆడబిడ్డ జన్మించింది. ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా, మూడో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో రవి తీవ్ర నిరాశకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రసవం అనంతరం తల్లిని ఐసీయూలో ఉంచడంతో అర్ధరాత్రి సమయంలో నవజాత శిశువును సంరక్షణ కోసం తండ్రి వద్ద ఉంచారు. తెల్లవారుజామున వరకు పాప ఏడుస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఏడుపు ఆగిపోవడంతో నర్సింగ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే శిశువును పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభమైంది. పోలీసుల విచారణలో రవి కుమార్ యాదవ్ తన కుమార్తెను గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. నర్సింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్వాజీ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనతో నిమ్స్ ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. నవజాత శిశువుల వార్డులో తగిన నిఘా ఉందా, శిశువును పూర్తిగా తండ్రి సంరక్షణలో ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమవుతోంది. ఆడబిడ్డలపై వివక్ష ఇంకా సమాజంలో కొనసాగుతుండటంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

5 రోజుల్లో 4 రాష్ట్రాలు.. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్

రాజమండ్రి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నుంచి గోదావరిలో దూకి పిఠాపురం...

గవర్నమెంట్ హాస్టల్స్‌లో సకల సౌకర్యాలు.. స్టూడెంట్స్‌ హాయిగా చదువుకోవచ్చు!

ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు.. గోదావరి నుంచి నేరుగా నగరానికి

వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర...

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...