అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల పర్యటనకు రైతుల అడ్డుకట్టు…

Date:

అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల పర్యటనకు రైతుల అడ్డుకట్టు.. తోపులాట, రాళ్ల దాడి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెనుమాక పర్యటనకు బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలను అమరావతి రైతులు, మహిళలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. అనంతరం వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడినట్లు తెలిసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

రైతుల నిరసన..

తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి వద్ద వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులను రైతులు అడ్డుకుని ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కృష్ణాయపాలెం, పెనుమాక ప్రాంతాల్లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా అంగీకరించిన తర్వాతే వైసీపీ నేతలు ఈ ప్రాంతంలో పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు.

గత ఐదేళ్లపాటు మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని రైతులు ఆరోపించారు. స్థానిక రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వారు విమర్శించారు.

వైసీపీ నేతల ఆరోపణలు..

మరోవైపు తమ పర్యటనను అడ్డుకోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలు బయటకు రాకుండా ఉండేందుకే తమపై దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తమను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ, ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన స్కీమ్‌..!

Post Office Gram Suraksha Scheme: రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను...

చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా,...

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో...