ఏపీలో 2 కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ఎల్ అండ్ టీకి అమరావతి ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం.. కేబినెట్ నిర్ణయాలివే!

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 34 అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, అమరావతిలో నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించేందుకు అనుమతి తెలిపింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026, పాదచారుల భద్రతా విధానం, అమరావతి అభివృద్ధి, విద్య, పరిశ్రమలు, చట్ట సంస్కరణలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, పరిశ్రమలు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం మొత్తం 34 ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ.1,002.49 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. ఈ నిర్మాణ పనులను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు అనుమతి మంజూరు చేసింది. అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ భవనాల డిజైన్ల పూర్తి కోసం అదనపు నిధుల విడుదలకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది.

అమరావతి భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎం) చేసిన సిఫార్సులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అలాగే ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 ముసాయిదా, ఏపీ పీపీపీ పాలసీ-2026కు ఆమోదం తెలిపింది. పరిశ్రమల విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ భూముల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు అనుమతి, వాటికి రాయితీ ధరలో విద్యుత్ సరఫరా చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...